dhanush: తీవ్ర పోటీ మధ్య.. 'మారి 2' విడుదలకి సిద్ధం!

  • సెన్సార్ పూర్తిచేసుకున్న 'మారి 2'
  • ధనుశ్ జోడీగా సాయిపల్లవి 
  • ఈ నెల 21వ తేదీన విడుదల       

ధనుశ్ కథానాయకుడిగా బాలాజీ మోహన్ దర్శకత్వంలో 'మారి 2' నిర్మితమైంది. ధనుశ్ సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాలో కథానాయికగా సాయిపల్లవి నటించింది. ఈ నెల 21వ తేదీన ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగులోను విడుదల చేయనున్నారు. తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ సినిమా, యు/ఎ సర్టిఫికెట్ ను సంపాదించుకుంది.

 తమిళంలో మాస్ హీరోగా ధనుశ్ కి మంచి క్రేజ్ వుంది. 'మారి 2' కూడా మాస్ కంటెంట్ తోనే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ధనుశ్ సినిమాల్లో 'రఘువరన్ బీటెక్' మాత్రమే తెలుగులో సక్సెస్ అయింది. ఆ తరువాత వచ్చిన ఆయన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయినా 21వ తేదీన రావడానికే ఆయన సిద్ధమవుతున్నాడు. 'పడి పడి లేచే మనసు' .. 'అంతరిక్షం' .. 'కేజిఎఫ్' పోటీని తట్టుకుని 'మారి 2' నిలబడవలసి ఉంటుంది. 

More Telugu News