Andhra Pradesh: మోస్ట్ వాంటెడ్ చెడ్డీ-బనియన్ గ్యాంగ్ అరెస్ట్.. 8 ఏళ్లుగా ఏపీ పోలీసులకు చుక్కలు చూపించిన ముఠా!

  • గుజరాత్ లోని దహోద్ కేంద్రంగా కార్యకలాపాలు
  • ఏపీ, తెలంగాణ, తమిళనాడులో 40 చోరీలు
  • పరారీలో ఐదుగురు ముఠా సభ్యులు

ఆంధ్రప్రదేశ్ లో వరుస చోరీలతో హడలెత్తించిన చెడ్డీ బనియన్ గ్యాంగ్ ను విశాఖపట్నం పోలీసులు ఈరోజు అరెస్ట్ చేశారు. 2010 నుంచి ఈ గ్యాంగ్ ఏపీలోని నెల్లూరు, తిరుపతి, విశాఖపట్నంతో పాటు తెలంగాణ, తమిళనాడులో పలు చోరీలకు పాల్పడింది. ఈ నేపథ్యంలో చెడ్డీ బనియన్ గ్యాంగ్ కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు గుజరాత్ కు వెళ్లి ముఠా నాయకుడు మడియ కంజి, మందోల్ సుమలభాయి, సత్రభాయి రుమల్ భాయిలను అరెస్ట్ చేశారు.

ఈ విషయమై పోలీస్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. ఈ ముఠాలో ఇంకా ఐదుగురు సభ్యులు ఉన్నారని తెలిపారు. పరారీలో ఉన్న వీరి కోసం గాలింపు ప్రారంభించామని చెప్పారు. ఈ చెడ్డీ బనియన్ గ్యాంగ్ సభ్యులు గుజరాత్ లోని దహోద్ జిల్లాకు చెందినవారని పేర్కొన్నారు. నిందితుల నుంచి బంగారు నగలు, వెండితో పాటు కారు, రెండు బైక్ లు, ఓ రాడ్డును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వీరిపై 40 కేసులు ఉన్నాయని పేర్కొన్నారు.

More Telugu News