anthariksham: ‘అంతరిక్షం’ తొలి టికెట్ ను కొనుగోలు చేసిన హీరో రామ్ చరణ్

  • హైదరాబాద్ లో ‘అంతరిక్షం’ ప్రీ-రిలీజ్ వేడుక
  • ముఖ్యఅతిథిగా హాజరైన రామ్ చరణ్
  • వరుణ్ మంచి సినిమాతో రాబోతున్నాడన్న చరణ్

సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం అంతరిక్షం ప్రీ-రిలీజ్ వేడుక హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా హాజరైన ప్రముఖ హీరో రాంచరణ్ ‘అంతరిక్షం’ తొలి టికెట్ ను కొనుగోలు చేశారు.

ఈ సందర్భంగా ఈ చిత్ర హీరో వరుణ్ తేజ్ మాట్లాడుతూ, ఈ సినిమా కథ విన్నప్పుడు తనకు కొంచెం అనుమానం వచ్చిందని, ఇలాంటి కథను ప్రేక్షకులు ఆదరిస్తారా అని అనుకున్నానని చెప్పాడు. రామ్ చరణ్ కు ఈ విషయం చెబితే.. ఈ కథ, ఈ సినిమా డైరెక్టర్ కరెక్టు అని చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు.

హీరో రామ్ చరణ్ మాట్లాడుతూ, వరుణ్ చాలా మంచి సినిమాతో మీ ముందుకు రాబోతున్నాడని అన్నాడు. ఈ చిత్రం ట్రైలర్ ఇటీవలే తాను చూశానని, ఇంత మంచి ట్రైలర్ ఈ మధ్య కాలంలో తాను చూడలేదని ప్రశంసించాడు. ఇంత మంచి సినిమాను తీసిన ప్రొడ్యూసర్స్ ని అభినందిస్తున్నానని అన్నాడు.

కాగా, ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన అదితీరావ్ హైదరి, లావణ్య త్రిపాఠి హీరోయిన్లుగా నటించారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై క్రిష్ జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి, సాయిబాబు నిర్మించారు. ఈ నెల 21న ‘అంతరిక్షం’ విడుదల కానుంది.

More Telugu News