Telangana: తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశాం: ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి

  • అసెంబ్లీ ఎన్నికల వల్లే పంచాయతీ ఎన్నికలు వాయిదా 
  • డిసెంబర్ 31 తర్వాత ఎన్నికలెప్పుడొచ్చినా సిద్ధమే
  • అసెంబ్లీ ఓటర్ల జాబితా ఆధారంగానే ఈ ఎన్నికలు

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని మాసబ్ ట్యాంక్ లోని సీడీఎంఏ కార్యాలయంలో ఈరోజు ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ లో అన్ని జిల్లాల పంచాయతీ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా త్వరలో జరగబోయే పంచాయతీ ఎన్నికలపై చర్చించారు. అసెంబ్లీ ఎన్నికలు రావడం వల్లే పంచాయతీ ఎన్నికలు వాయిదా పడ్డాయని, డిసెంబర్ 31 తర్వాత పంచాయతీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని, నిబంధనలకు లోబడే ఈ ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

ఇప్పటికే బ్యాలెట్ పేపర్లు కూడా ప్రింట్ చేశామని, అసెంబ్లీ ఓటర్ల జాబితాను అనుసరించే ఈ ఎన్నికలు కూడా జరుగుతాయని చెప్పారు. పంచాయతీ ఎన్నికలపై కొత్త సిబ్బందికి శిక్షణ ఇస్తున్నామని, ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలకు ఓటర్ల జాబితా పంపించినట్టు చెప్పారు. 

More Telugu News