vijay devarakonda: 'టాక్సీవాలా' జర్నీ ముగిసింది .. భారీ షేర్ సాధించింది

  • 'అర్జున్ రెడ్డి' తరువాత స్థానంలో 'టాక్సీవాలా'
  • నైజామ్ ఏరియాలో 7.70 కోట్ల షేర్ 
  • ఓవర్సీస్ లో 3 కోట్ల షేర్    

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా 'టాక్సీవాలా' సినిమాను దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ తెరకెక్కించాడు. నవంబర్ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, తొలి ఆటతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ప్రియాంక జవాల్కర్ .. మాళవిక నాయర్ కథానాయికలుగా నటించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లోను భారీ వసూళ్లను సాధించింది.

వసూళ్ల పరంగా 'గీత గోవిందం' .. 'అర్జున్ రెడ్డి' సినిమాల తరువాత స్థానంలో నిలిచింది. ట్రేడ్ వర్గాల నుంచి అందుతోన్న సమాచారం ప్రకారం ఈ సినిమా, అన్ని ప్రాంతాలలోను బాక్సాఫీస్ రన్ పూర్తిచేసుకుంది. ఓవరాల్ గా 21.28 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ ను వసూలు చేసింది. ఒక్క నైజామ్ ఏరియాలోనే ఈ సినిమా 7.70 కోట్ల షేర్ ను సాధించగా .. ఓవర్సీస్ లో 3 కోట్ల షేర్ ను రాబట్టింది. అలా ఈ సినిమాను కొనుగోలు చేసిన వాళ్లందరికీ మంచి లాభాలను తెచ్చిపెట్టింది.

More Telugu News