Telangana: తెలంగాణకు గుడ్ న్యూస్.. బీబీనగర్ ఎయిమ్స్‌కు కేంద్రం ఆమోదం

  • మధురై, బీబీనగర్‌లలో ఎయిమ్స్ నిర్మాణానికి కేంద్రం ఆమోదం
  • బీబీనగర్‌కు రూ. 1028 కోట్లు, మధురైకి రూ.1264 కోట్లు
  • ఆసుపత్రిలో 100 ఎంబీబీఎస్, 60 నర్సింగ్ సీట్లు

తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం శుభవార్త అందించింది. బీబీనగర్‌లో ఎయిమ్స్ ఆసుపత్రిని నిర్మించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనకు సోమవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ. 1028 కోట్లతో నిర్మించనున్న ఈ ఆసుపత్రిలో 100 ఎంబీబీఎస్ సీట్లు, 60 నర్సింగ్ సీట్లు ఉంటాయి. 750 పడకలతో, 15 విభాగాలతో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిగా దీనిని నిర్మిస్తారు. తమిళనాడులోని మధురైలోనూ ఎయిమ్స్ నిర్మించేందుకు ఈ సందర్భంగా కేంద్రం ముందుకొచ్చింది. ఇందుకోసం రూ.1264 కోట్లను ఖర్చు చేయనున్నట్టు తెలిపింది.

More Telugu News