Ganta Srinivasa Rao: సముద్ర తీరంలో చిక్కుకుపోయిన మంత్రి గంటా వాహనం

  • తీరం దాటిన పెథాయ్ తుపాను
  • క్షేత్ర స్థాయి పరిశీలనకు వెళ్లిన మంత్రి గంటా
  • మంగమర్రిపేట పేట వద్ద ఇసుకలో కూరుకుపోయిన కారు

పెథాయ్ తుపాను తీరాన్ని దాటింది. దీని ప్రభావంతో ఉభయగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాను నేపథ్యంలో క్షేత్ర స్థాయి పరిశీలనకు మంత్రి గంటా శ్రీనివాసరావు వెళ్లారు. ఈ క్రమంలో ఆయన ప్రయాణిస్తున్న కారు సముద్ర తీరంలోని ఇసుకలో కూరుకుపోయింది. భీమిలి బీచ్ దగ్గరలో ఉన్న మంగమర్రిపేట వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో, ఆయన రక్షణ సిబ్బంది కారును బయటకు లాగే ప్రయత్నం చేస్తున్నారు. 

More Telugu News