Chandrababu: సాయంత్రానికి విశాఖపట్నం చేరుకోనున్న చంద్రబాబు

  • కాంగ్రెస్ ముఖ్యమంత్రుల ప్రమాణస్వీకారానికి హాజరైన చంద్రబాబు
  • సాయంత్రం 5 గంటలకు విశాఖకు చేరుకోనున్న సీఎం
  • కీలక శాఖల మంత్రులు విశాఖకు రావాల్సిందిగా ఆదేశం

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సాయంత్రం 5 గంటలకు విశాఖపట్నం చేరుకోనున్నారు . ఈరోజు, రేపు విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో ఆయన పర్యటించనున్నారు. పెథాయ్ తుపాను తీరాన్ని తాకడంతో ఆయన విజయవాడకు కాకుండా, నేరుగా విశాఖ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. తుపాను వల్ల విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలపై ఎక్కువ ప్రభావం ఉండనుండటంతో ఆయన ఆ జిల్లాలపై దృష్టిని కేంద్రీకరించారు. కీలక శాఖల మంత్రులంతా విశాఖ రావాల్సిందిగా ఇప్పటికే ఆదేశాలు అందాయి. ఉన్నతాధికారులు కూడా విశాఖకు బయల్దేరారు. మూడు రాష్ట్రాలకు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ప్రమాణస్వీకారం చేస్తున్న నేపథ్యంలో, చంద్రబాబు ఆ కార్యక్రమాలకు హాజరయ్యారు. అక్కడి నుంచి నేరుగా విశాఖ చేరుకోనున్నారు.

More Telugu News