fishermen: సముద్రంలో చిక్కుకుపోయిన మత్స్యకారుల బోటు

  • కాకినాడ నుంచి విశాఖకు వస్తుండగా సముద్రంలో చిక్కుకుపోయిన బోటు
  • బోటులో ఆరుగురు మత్స్యకారులు
  • మత్స్యకారులను రక్షించేందుకు రంగంలోకి దిగిన అధికారులు

పెథాయ్ తుపాను ప్రభావంతో ఏపీలోని తీరప్రాంతం అల్లకల్లోలంగా ఉంది. పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు, చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారుల బోట్లు కూడా ఒడ్డుకు చేరుకుంటున్నాయి. అయితే, ఓ బోటు మాత్రం సముద్రంలో చిక్కుపోయింది. కాకినాడ నుంచి విశాఖ వైపు వస్తుండగా ఈ బోటు చిక్కుకుపోయినట్టు సమాచారం.

ఈ బోటులో ఎస్.రాయవరం మండలం పోలవరంకు చెందిన ఆరుగురు మత్స్యకారులు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, వారికోసం కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న అధికారులు సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారులను రక్షించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. 

More Telugu News