kavitha: ట్వీట్ లో దొర్లిన తప్పు.. సవరించమని కోరిన కవిత

  • బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టోర్నీలో విజేతగా నిలిచిన పీవీ సింధు
  • ఫస్ట్ ఇండియా అయినందుకు శుభాకాంక్షలు అన్న కవిత
  • ఫస్ట్ ఇండియన్ గా మార్చాలంటూ ట్విట్టర్ కు విన్నపం

బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టోర్నీలో పీవీ సింధు విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎంపీ కవిత ట్విట్టర్ ద్వారా సింధుకు శుభాకాంక్షలు తెలిపారు. తన ట్వీట్ లో భాగంగా... 'బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఫైనల్స్ లో స్వర్ణం దక్కించుకున్న ఫస్ట్ ఇండియా అయినందుకు శుభాకాంక్షలు' అని తెలిపారు. ఆ తర్వాత తన తప్పును ఆమె సవరించుకున్నారు. 'ప్లీజ్.. నా తప్పును సవరించు ట్విట్టర్. ఫస్ట్ ఇండియాను ఫస్ట్ ఇండియన్ గా మార్చు' అంటూ మరో ట్వీట్ చేశారు. కవిత చేసిన ఈ ట్వీట్ నెటిజన్లను ఆకర్షిస్తోంది.

More Telugu News