sabarimala: శబరిమలకు వెళ్తున్న నలుగురు ట్రాన్స్ జెండర్లను అడ్డుకున్న పోలీసులు

  • ఇప్పటికీ ఉద్రిక్తతల మధ్య ఉన్న శబరిమల
  • తమను పోలీసులు అడ్డుకున్నారని ఆరోపించిన ట్రాన్స్ జెండర్లు
  • ఆరోపణలను ఖండించిన పోలీసులు

శబరిమల అయ్యప్పను దర్శించుకునేందుకు వెళ్తున్న నలుగురు ట్రాన్స్ జెండర్లను పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటన ఈరోజు చోటుచేసుకుంది. నలుగురిలో ఒకరైన అనణ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ, తమను డ్యూటీలో ఉన్న అధికారులు అడ్డుకున్నారని... ఆలయం వైపు వెళ్లకుండా నిలువరించారని విమర్శించారు.

అయితే, వీరి ఆరోపణలను పోలీసులు ఖండించారు. ఆలయ పరసరాల్లోని ఉద్రికత్తల గురించి వారికి తాము తెలియజేశామని... దీంతో, వారే వెనుదిరిగారని చెప్పారు. ఈ ఘటన అనంతరం కొట్టాయం జిల్లా ఎస్పీని కలిసేందుకు నలుగురు ట్రాన్స్ జెండర్లు వెళ్లారు. ఆలయనికి సంబంధించిన అబ్జర్వేషన్ కమిటీని కూడా కలవాలని వారు భావిస్తున్నారు.

More Telugu News