Bhavanam Venkatram Reddy: మాజీ సీఎం భవనం వెంకట్రామరెడ్డి కుమారుడు మృతి!

  • ఈ ఉదయం గుండెపోటుతో మృతి
  • సంతాపం తెలిపిన కాంగ్రెస్ నేతలు
  • నేడు మహాప్రస్థానంలో అంత్యక్రియలు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత భవనం వెంకట్రామరెడ్డి కుమారుడు, సన్ షైన్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ గురవారెడ్డి బావమరిది భవనం శ్రీనివాస్ గుండెపోటుతో మరణించారు. ఆయన వయసు 57 సంవత్సరాలు. ఈ విషయాన్ని వెల్లడించిన కుటుంబ సభ్యులు, ఆదివారం సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్, జూబ్లీహిల్స్ లోని మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తామని తెలిపారు. భవనం శ్రీనివాస్ మృతి పట్ల ఆయన కుటుంబ సభ్యులకు పలువురు కాంగ్రెస్ నేతలు సంతాపం వెలిబుచ్చారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.

More Telugu News