Police: ప్రియుడే కావాలంటూ భర్తను కిరాతకంగా హత్య చేయించిన భార్య!

  • తొర్రూర్ సమీపంలో ఘటన
  • ఓటేసేందుకు వచ్చిన దంపతులు
  • ప్రియుడితో కలసి భర్తను హత్య చేసిన భార్య
  • అరెస్ట్ చేసిన పోలీసులు

ప్రియుడితో వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నాడన్న కారణంతో భర్తను దారుణంగా హత్య చేయించిందో ఇల్లాలు. అయితే, పోలీసుల విచారణలో దొరికిపోయి, తన ఇద్దరు కూతుళ్లనూ అనాధలను చేసింది. తొర్రూర్ డీఎస్పీ మదన్ లాల్ వెల్లడించిన వివరాల ప్రకారం, నెల్లికుదురు ప్రాంతానికి చెందిన జెల్లక వెంకన్నకు కేసముద్రంకు చెందిన సుభద్రతో 18 ఏళ్ల క్రితం వివాహం కాగా, వీరికి యమున, మనీషలు కుమార్తెలు. కూలి పనులు చేసుకుంటూ వీరు జీవితాన్ని గడుపుతున్నారు.

ఈ క్రమంలో అమనగల్ ప్రాంతానికి చెందిన లావుడ్యా రాము అలియాస్ శీను వద్ద వెంకన్న రూ. 50 వేలు అప్పు తీసుకున్నాడు. ఆపై రాము, సుభద్రల మధ్య వివాహేతర బంధం ఏర్పడింది. దీన్ని గమనించిన వెంకన్న, పధ్ధతి మార్చుకోవాలని చెప్పి చూశాడు. అయినా వినలేదు. పంచాయితీ పెట్టి పెద్దలతో చెప్పించినా ఆమె మారలేదు.

భర్తను వదిలించుకోవాలని సుభద్ర నిర్ణయానికి రాగా, రాముతో పాటు అతని మిత్రుడు లూనావత్ మంగిలాల్ కలసి వచ్చారు. 7వ తేదీ ఎన్నికల సందర్భంగా ఓటేసేందుకు భర్తను తీసుకుని సుభద్ర పార్వమ్మ గూడెంకు వచ్చింది. అదే గ్రామంలో ఉన్న మంగిలాల్, రాములు అర్ధరాత్రి వారింటికి చేరుకోగా, గొడ్డలితో వెంకన్న నుదుటిపై నరికి, ఆపై బండరాయితో దాటి చేసి, ముగ్గురూ కలసి కిరాతకంగా హత్య చేశారు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు, పోలీసులు కేసును విచారించి, నిందితులు ముగ్గురినీ అరెస్ట్ చేశారు.

More Telugu News