sai dharam tej: మెట్రో ట్రైన్ లో షూటింగ్ జరుపుకున్న తేజు మూవీ

  • కిషోర్ తిరుమల నుంచి మరో చిత్రం 
  • తేజు సరసన ఇద్దరు నాయికలు 
  • ముఖ్యమైన పాత్రలో సునీల్      

ప్రేమకథా చిత్రాల స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్న కిషోర్ తిరుమల దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి 'చిత్రలహరి' అనే టైటిల్ ను ఖరారు చేశారు. కల్యాణి ప్రియదర్శన్ .. నివేదా పేతు రాజ్ కథానాయికలుగా నటిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే 50 శాతం చిత్రీకరణను జరుపుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగు జరుగుతోంది.

రీసెంట్ గా హైదరాబాద్ మెట్రో ట్రైన్లో షూటింగ్ చేశారు. మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వరకూ వెళ్లే రైల్లో ఓ సీన్ ను షూట్ చేశారని తేజు చెప్పాడు. షూటింగ్ చాలా సూపర్ గా జరిగిందని అన్నాడు. ఈ జర్నీ చాలా హ్యాపీగా అనిపించిందని చెప్పాడు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించే ఈ సినిమాలో సునీల్ ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. 

More Telugu News