harish shankar: అదంతా ప్రచారమే .. అందులో నిజం లేదు: హరీశ్ శంకర్

  • 'జిగర్తాండా' రీమేక్ పై హరీశ్ శంకర్ స్పందన 
  • ఇదంతా కేవలం పుకారు మాత్రమే 
  • ట్విట్టర్ చూసి ఖరారు చేసుకోవాలి   

 తమిళంలో కొంతకాలం క్రితం వచ్చిన 'జిగర్తాండా' ఘన విజయాన్ని సాధించింది. ఈ సినిమాలోని కొత్తదనం అక్కడి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. రికార్డుస్థాయి వసూళ్లను సొంతం చేసుకుంది. దాంతో దర్శకుడు హరీశ్ శంకర్ ఈ సినిమాను తెలుగులోకి రీమేక్ చేయనున్నాడనే వార్తలు కొన్ని రోజులుగా షికారు చేస్తున్నాయి.

ఈ రీమేక్ కోసం ఆయన నాగశౌర్య .. రాజ్ తరుణ్ లను సంప్రదిస్తున్నాడనీ, విలన్ పాత్ర కోసం వరుణ్ తేజ్ ను ఒప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే టాక్ వచ్చింది. తాజాగా ఈ విషయాన్ని గురించి హరీశ్ శంకర్ స్పందించాడు. ఈ ముగ్గురు హీరోలతో తాను సినిమా చేయనున్నట్టుగా వస్తోన్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని చెప్పాడు. ఇదంతా కేవలం పుకారు మాత్రమేనని అన్నాడు. తన సినిమాలకి సంబంధించిన విషయాలను తన ట్విట్టర్ చూసి ఖరారు చేసుకోవాలని ఆయన స్పష్టం చేశాడు. 

More Telugu News