rajani: కర్ణాటకలోను రికార్డు సృష్టించనున్న '2.ఓ'

  • కర్ణాటకలో 45 కోట్ల వసూళ్లు 
  • 50 కోట్లు రాబడితే రజనీ రికార్డ్ 
  • త్వరలో చైనాలో భారీ విడుదల  

శంకర్ దర్శకత్వం వహించిన '2.ఓ' విడుదలైన ప్రతి ప్రాంతంలోను విజయవిహారం చేస్తోంది. ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కొత్త రికార్డులను నెలకొల్పుతూ తన సత్తా చాటుతోంది. కర్ణాటకలోను ఈ సినిమా ఇదే జోరును కొనసాగిస్తోంది. 15 రోజులలో ఇక్కడి వసూళ్లు 45 కోట్లకి చేరుకున్నాయి.

కన్నడ నాట ఫుల్ రన్ పూర్తయ్యేసరికి ఈ వసూళ్లు 50 కోట్లకి చేరుకుంటాయని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే కర్ణాటకలో అత్యధిక వసూళ్లను సాధించిన రజనీ తొలి చిత్రంగా '2.ఓ' అరుదైన ఘనతను సొంతం చేసుకుంటుంది. ఇక త్వరలోనే ఈ సినిమాను చైనాలో 56 వేల స్క్రీన్లలో విడుదల చేయనున్నారు. అక్కడ ఏ స్థాయి విజయాన్ని సాధిస్తుందో .. ఎన్నేసి రికార్డులను సృష్టిస్తుందో చూడాలి. 

More Telugu News