Telangana: కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల సమావేశం.. ఓటమిపై చర్చ

  • తెలంగాణ ఎన్నికల్లో ఘోర పరాజయం
  • 19 స్థానాలకు పరిమితమైన కాంగ్రెస్
  • ఈవీఎంల టాంపరింగ్‌పై చర్చ

ఇటీవల తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో ప్రజా కూటమి ఘోర పరాజయం పాలైంది. కేవలం 21 స్థానాలకు, అందులోనూ కాంగ్రెస్ 19 స్థానాలకు పరిమితమైంది. అయితే ఈ ఓటమిపై సమీక్ష నిర్వహించేందుకు నేడు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో సమావేశమయ్యారు.

టీడీపీతో జత కట్టడం వలన కలిగిన లాభ నష్టాలు, ఈవీఎంల ట్యాంపరింగ్ తదితర అంశాలపై చర్చిస్తున్నట్టు సమాచారం. ఈ సమీక్ష సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి, రమేశ్ రాథోడ్, సునీతా లక్ష్మారెడ్డి, పొన్నం ప్రభాకర్, దాసోజు శ్రవణ్, ఆరేపల్లి మోహన్ తదితరులు హాజరయ్యారు.    

More Telugu News