gajjela kantham: గజ్జెల కాంతంపై టీపీసీసీ సీరియస్.. షోకాజ్ నోటీసులు జారీ

  • ఉత్తమ్ కుమార్ రెడ్డిపై గజ్జెల కాంతం తీవ్ర విమర్శలు
  • షోకాజ్ నోటీసులు జారీ చేసిన క్రమశిక్షణ సంఘం
  • రేపటి లోగా వివరణ ఇవ్వాలంటూ ఆదేశం

టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై పార్టీ అధికార ప్రతినిధి గజ్జెల కాంతం తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఉత్తమ్ తన స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీని నాశనం చేశారని మండిపడ్డారు. పీసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన వ్యాఖ్యలపై పీసీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనకు పార్టీ క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. రేపటిలోగా వివరణ ఇవ్వాలంటూ నోటీసులో పేర్కొంది. 

More Telugu News