varun tej: 'అంతరిక్షం' విడుదలకి అంతా సిద్ధం

  • సంకల్ప్ రెడ్డి నుంచి 'అంతరిక్షం'
  • టీచర్ పాత్రలో లావణ్య త్రిపాఠి 
  • ఈ నెల 21వ తేదీన విడుదల

వరుణ్ తేజ్ కథానాయకుడిగా సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో 'అంతరిక్షం' నిర్మితమైంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని క్లీన్ 'యు' సర్టిఫికెట్ ను సొంతం చేసుకుంది. ఈ నెల 21వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తికావడంతో, ఆ తరువాత పనులను వేగవంతం చేశారు.

వరుణ్ తేజ్ తో పాటు అదితీరావు వ్యోమగామిగా కనిపించనుండగా, పార్వతీ టీచర్ పాత్రలో లావణ్యత్రిపాఠి కనిపించనుంది. రెహ్మాన్ (రఘు) ఈ సినిమాలో కీలకమైన పాత్రను పోషించాడు. అంతరిక్షం నేపథ్యంలో తెలుగులో తొలిసారిగా నిర్మితమైన సినిమా ఇదే. అందువలన ఈ సినిమాపై అందరిలోను ఆసక్తి వుంది. సముద్రం - జలాంతర్గామి నేపథ్యంలో 'ఘాజీ' తీసి మెప్పించిన సంకల్ప్ రెడ్డి నుంచి ఈ సినిమా వస్తుండటం మరింత ఆత్రుతను పెంచుతోంది. 

More Telugu News