madakasira: సుప్రీం తీర్పు నేపథ్యంలో.. మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఈరన్న రాజీనామా

  • ఎమ్మెల్యేగా ఈరన్న ఎన్నిక చెల్లదన్న సుప్రీంకోర్టు
  • అమరావతిలో అసెంబ్లీ కార్యదర్శిని కలిసిన ఈరన్న
  • రాజీనామా లేఖ అందజేత

మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఈరన్న ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన ఎమ్మెల్యే పదవికి ఈరన్న రాజీనామా చేశారు. అమరావతిలో అసెంబ్లీ కార్యదర్శిని కలిసి ఈరన్న తన రాజీనామా లేఖను అందజేశారు. కాగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి ఈరన్న, వైసీపీ నుంచి తిప్పేస్వామి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో తిప్పేస్వామి ఓటమి పాలయ్యారు. అయితే, ఎన్నికల అఫిడవిట్ లో తనపై కర్ణాటకలో నమోదైన క్రిమినల్ కేసులు, తన భార్య ప్రభుత్వ ఉద్యోగి అన్న విషయాన్ని ఈరన్న ప్రస్తావించలేదు. దీనిని సవాల్ చేస్తూ హైకోర్టులో తిప్పేస్వామి పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు తీర్పు తిప్పేస్వామికి అనుకూలంగా వచ్చింది. దీంతో, ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఈరన్న ఆశ్రయించగా అక్కడా ఆయనకు చుక్కెదురైంది.

More Telugu News