nagashaurya: ముగ్గురు హీరోలను ఒప్పించే పనుల్లో హరీశ్ శంకర్

  • తమిళంలో హిట్ కొట్టిన 'జిగర్తాండా'
  • గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో సాగే కథ 
  • కథానాయికగా రష్మిక మందన  

'దువ్వాడ జగన్నాథం' తరువాత దర్శకుడు హరీశ్ శంకర్ 'దాగుడుమూతలు' అనే టైటిల్ తో ఒక మల్టీ స్టారర్ చేయాలనుకున్నాడు. ఆ ప్రాజెక్టు పట్టాలెక్కకపోవడంతో, తమిళంలో హిట్ కొట్టిన 'జిగర్తాండా'ను తెలుగులో రీమేక్ చేయడానికి నడుం బిగించాడు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో 2014లో తమిళంలో వచ్చిన 'జిగర్తాండా' ఘన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా సిద్ధార్థ్ కి .. బాబీ సింహాకి మంచి పేరు తెచ్చిపెట్టింది.

ఇప్పుడు తెలుగులో రీమేక్ చేయాలనుకుంటున్న హరీశ్ శంకర్, నాగశౌర్య - రాజ్ తరుణ్ లను హీరోలుగా తీసుకోవడానికి గాను సంప్రదింపులు మొదలుపెట్టాడు. ఇక విలన్ పాత్రకి గాను వరుణ్ తేజ్ ను ఒప్పించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాడు. గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో కథానాయికగా రష్మిక మందనను తీసుకున్నాడు. అంతా అనుకున్నట్టుగా జరిగితే సెట్స్ పైకి వెళ్లడానికి ఎక్కువ సమయం పట్టదట.   

More Telugu News