gopichand: గోపీచంద్ సరసన మరోమారు ఛాన్స్ కొట్టేసిన రాశి ఖన్నా

  • దర్శకుడు 'తిరు'కి గ్రీన్ సిగ్నల్ 
  • వచ్చే ఏడాది ఆరంభంలో షూటింగ్ 
  • ద్వితీయార్థంలో ప్రేక్షకుల ముందుకు   

కొంతకాలంగా గోపీచంద్ తో సక్సెస్ అనేది దాగుడుమూతలు ఆడుతోంది. మాస్ ఆడియన్స్ .. ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరించే కథలను ఎంచుకుంటూ వస్తున్నా, సక్సెస్ అనేది ఆమడ దూరంలోనే ఉండిపోతోంది. ఈ నేపథ్యంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఆయన మరో కథను ఎంచుకున్నాడు. తమిళ దర్శకుడు 'తిరు' వినిపించిన కథ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.

అనిల్ సుంకర నిర్మించే ఈ సినిమాలో కథానాయికగా రాశి ఖన్నాను ఎంచుకున్నారు. గతంలో గోపీచంద్ ..రాశి ఖన్నా కలిసి నటించిన 'జిల్' సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఆ సెంటిమెంట్ తోనే గోపీచంద్ జోడీగా మరోసారి రాశి ఖన్నాను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. వచ్చే ఏడాది ఆరంభంలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టి, ద్వితీయార్థంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో వున్నారు. ఈ సారైనా గోపీచంద్ కి హిట్ పడుతుందేమో చూడాలి.    

More Telugu News