India: తండ్రి ‘బోఫోర్స్’లో దోచుకుంటే.. తల్లీకొడుకులు ‘అగస్టా’లో దండుకున్నారు!: కాంగ్రెస్ నేతలపై జీవీఎల్ ఫైర్

  • రాఫెల్ కేసులను కొట్టివేసిన సుప్రీంకోర్టు
  • అనుమానాస్పద అంశాలేవీ లేవని స్పష్టీకరణ
  • రాజీవ్, సోనియా, రాహుల్ పై జీవీఎల్ విమర్శలు

ఫ్రాన్స్ నుంచి 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు కోసం కేంద్రం చేసుకున్న ఒప్పందంలో అనుమానాస్పదంగా ఏమీ లేదని ఈ రోజు సుప్రీంకోర్టు తేల్చింది. ఈ కేసులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించింది. రాఫెల్ పై దాఖలైన పిటిషన్లు అన్నింటినీ కొట్టివేసింది. ఈ నేపథ్యంలో బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు ట్విట్టర్ లో స్పందించారు.

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓ అబద్ధాల పుట్ట అని తాజాగా సుప్రీం తీర్పుతో రుజువయిందని తెలిపారు. బోఫోర్స్ శతఘ్నుల కుంభకోణంలో రాహుల్ తండ్రి (రాజీవ్ గాంధీ) మధ్యవర్తిగా వ్యవహరిస్తే, తల్లీకొడుకులు (సోనియా-రాహుల్ గాంధీ) అగస్టా హెలికాప్లర్ట  ఒప్పందంలో భారీగా ముడుపులు అందుకున్నారని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీని దోషిగా నిలబెట్టేందుకు రాహుల్ శతవిధాలా ప్రయత్నించారని మండిపడ్డారు. తాజాగా రాఫెల్ కేసులో కోర్టు తీర్పు రాహుల్ గాంధీకి చెంపదెబ్బ లాంటిదని వ్యాఖ్యానించారు.

More Telugu News