akhil: యూత్ ను పడగొట్టేసే పాటతో 'మిస్టర్ మజ్ను'

  • అఖిల్ నుంచి రొమాంటిక్ లవ్ స్టోరీ 
  • సంగీత దర్శకుడిగా తమన్ 
  • అర్మాన్ మాలిక్ ఆలాపన  

వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్ కథానాయకుడిగా 'మిస్టర్ మజ్ను' నిర్మితమైంది. రొమాంటిక్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ సినిమాలో నిధి అగర్వాల్ కథానాయికగా కనువిందు చేయనుంది. తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగ్ వీడియోను విడుదల చేశారు.

"ఏమైనదో ఏమైనదో పలుకు మరిచినట్టు పెదవికేమైనదో .. ఏమైనదో ఏమైనదో బరువు పెరిగినట్టు గుండెకేమైనదో.. " అంటూ ఈ పాట కొనసాగుతోంది. 'చుక్కలే మాయమైన నింగిలా .. చినుకులే కురవని మబ్బులాగా.. కాలమే కదలనన్న క్షణములాగా .. ఎన్నడూ తిరిగిరాని నిన్నలాగా ..' వంటి పదప్రయోగాలు బాగున్నాయి. తమన్ బాణీ .. శ్రీమణి సాహిత్యం .. అర్మాన్ మాలిక్ ఆలాపన ఈ పాటను యూత్ హృదయాలకి దగ్గరగా తీసుకెళతాయి. ఈ పాట కోసం ఫస్టు టైమ్ వయోలిన్స్ .. స్ట్రింగ్స్ సెక్షన్స్ వాడినట్టుగా తమన్ తెలిపాడు. జనవరి 25వ తేదీన ఈ సినిమాప్రేక్షకుల ముందుకు రానుంది.

More Telugu News