varun tej: 'అంతరిక్షం' ప్రీ రిలీజ్ ఈవెంట్ పైనే అందరి దృష్టి

  • ఈ నెల 18న ప్రీ రిలీజ్ ఈవెంట్ 
  • 21వ తేదీన భారీస్థాయి విడుదల 
  • వరుణ్ కెరియర్లో ప్రత్యేక చిత్రం

వరుణ్ తేజ్ హీరోగా సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో 'అంతరిక్షం' సినిమా రూపొందింది. లావణ్య త్రిపాఠి .. అదితీరావు కథానాయికలుగా నటించిన ఈ సినిమాను ఈ నెల 21వ తేదీన విడుదల చేయనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నెల 18వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకను హైదరాబాద్ జేఆర్సీ కన్వెక్షన్ లో నిర్వహించనున్నారు.

ఈ వేడుకకి చిరంజీవి .. పవన్ కల్యాణ్ ముఖ్య అతిథులుగా రానున్నట్టుగా వార్తలు షికారు చేశాయి. దాంతో ఒకే వేదికపై మెగా బ్రదర్స్ ను చూడాలనే ఆసక్తితో అభిమానులు వున్నారు. అయితే నిజంగానే వాళ్లు ఈ వేడుకకి వస్తున్నారా .. లేదా అనే విషయంలో స్పష్టత రాకపోవడంతో అభిమానుల్లో సందిగ్ధంలో పడ్డారు. నేడో .. రేపో ఈ విషయంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. వరుణ్ తేజ్ కెరియర్లోనే ఇది ఒక ప్రత్యేకమైన చిత్రమవుతుందని మెగా ఫ్యామిలీ భావిస్తోంది.  

More Telugu News