mohanlal: ఆసక్తిని రేకెత్తిస్తోన్న మోహన్ లాల్ టీజర్

  • మోహన్ లాల్ కథానాయకుడిగా 'లుసీఫెర్'
  • దర్శకుడిగా పృథ్వీ రాజ్ సుకుమార్ 
  • మార్చి 28వ తేదీన విడుదల

మలయాళంలో మోహన్ లాల్ కి గల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. విభిన్నమైన కథాంశాలతో కూడిన సినిమాలు చేస్తూ ఆయన వరుస విజయాలను అందుకుంటున్నారు. ఒక వైపున ఈ నెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి 'ఒడియన్' సిద్ధమవుతుండగానే ఆయన మరో సినిమాను ముగింపు దశకి తీసుకొచ్చేశారు .. ఆ సినిమా పేరే .. 'లుసీఫెర్'.

ఆంటోని నిర్మిస్తోన్న ఈ సినిమాకి పృథ్వీరాజ్ సుకుమార్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. మోహన్ లాల్ సరసన మంజు వారియర్ నటిస్తుండగా, కీలకమైన పాత్రలో వివేక్ ఒబెరాయ్ కనిపించనున్నాడు. దీపక్ దేవ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను మార్చి 28వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక టీజర్ ను వదిలారు. జైలు వాతావరణంతో కూడిన దృశ్యాలతో ఈ టీజర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. తెలుగులోను ఈ సినిమా ప్రేక్షకులముందుకు వచ్చే అవకాశాలు పుష్కలంగా వున్నాయి. 

More Telugu News