rajani: 'బాహుబలి' తరువాత '2.ఓ' ఈ ఘనతను సాధించింది

  • శంకర్ దర్శకత్వంలో వచ్చిన '2.ఓ'
  • ముందుగా 100 కోట్లు రాబట్టిన హిందీ వెర్షన్ 
  • 'పెట్టా'పై అభిమానుల్లో పెరుగుతోన్న ఆసక్తి

రజనీకాంత్ కథానాయకుడిగా .. అక్షయ్ కుమార్ ప్రతినాయకుడిగా తెరకెక్కిన '2.ఓ' ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. విడుదలైన ప్రతి ప్రాంతంలోను ఈ సినిమా తన జోరును చూపించింది. తెలుగు .. తమిళ.. హిందీ భాషల్లో విడుదలైన ఈ సినిమా, కొత్త రికార్డులను నెలకొల్పుతూనే వుంది. ముందుగా ఈ సినిమా హిందీ వెర్షన్లో 100 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఆ తరువాత కాస్త ఆలస్యంగా తెలుగు .. తమిళ వెర్షన్లలో 100 కోట్ల మార్క్ ను చేరుకుంది.

ఇలా మూడు వెర్షన్లలో విడుదలై ప్రతి భాషలోను 100 కోట్ల గ్రాస్ ను రాబట్టిన చిత్రంగా '2.ఓ' నిలిచింది. 'బాహుబలి' తరువాత ఈ రికార్డును దక్కించుకున్న సినిమా ఇదేనని అంటున్నారు. ఇలా '2.ఓ' ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. రజనీ అభిమానులు ఒక వైపున ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూనే, మరో వైపున సంక్రాంతికి రానున్న 'పెట్టా'పై దృష్టి పెట్టారు. మొత్తానికి రజనీ సందడి నాన్ స్టాప్ గా కొనసాగుతూనే వుంది.   

More Telugu News