sharwanand: ట్రైలర్ తో శర్వానంద్ .. సాయిపల్లవి వచ్చేస్తున్నారు

  • హను రాఘవపూడి నుంచి ప్రేమకథా చిత్రం 
  • రేపు ఉదయం ట్రైలర్ రిలీజ్ 
  • ఈ నెల 21వ తేదీన సినిమా విడుదల

హను రాఘవపూడి దర్శకత్వంలో రొమాంటిక్ లవ్ స్టోరీగా 'పడి పడి లేచె మనసు' నిర్మితమైంది. శర్వానంద్ .. సాయిపల్లవి జంటగా రూపొందిన ఈ సినిమాను ఈ నెల 21వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ట్రైలర్ ను వదలడానికి సన్నాహాలు చేస్తున్నారు. రేపు ఉదయం 11గంటలకు ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. ట్రైలర్ తో మరింతగా అంచనాలు పెంచే పనిలో హను రాఘవపూడి వున్నాడు.

సాధారణంగా కథాకథనాల్లో కొత్తదనం లేకపోతే అటు శర్వానంద్ గానీ .. ఇటు సాయిపల్లవి గాని అంగీకరించరు. అలాంటిది ఈ ఇద్దరూ కలిసి చేశారంటే కాన్సెప్ట్ లో విషయముందనే అనుకుంటున్నారు. శర్వానంద్ .. సాయిపల్లవి ఇద్దరూ కూడా చెరో హిట్ తరువాత చేస్తోన్న సినిమా ఇది. ఈ ఇద్దరూ కలిసి ఈ సినిమాతో హిట్ అందుకుంటారేమో చూడాలి మరి.  

More Telugu News