sasikala: వెంటాడుతున్న అక్రమాస్తుల కేసు.. జైల్లోనే శశికళను విచారిస్తున్న ఐటీ అధికారులు

  • కాసేపటి క్రితం పరప్పణ అగ్రహార జైలుకు చేరుకున్న ఐటీ అధికారులు
  • పోయస్ గార్డెన్ లో స్వాధీనం చేసుకున్న పత్రాలపై విచారణ
  • రెండు రోజులపాటు విచారణ కొనసాగే అవకాశం

అక్రమాస్తుల కేసులో దివంగత జయలలిత నెచ్చెలి శశికళ ఇప్పటికే బెంగళూరులోని పరప్పణ అగ్రహార సెంట్రల్ జైల్లో శిక్షను అనుభవిస్తున్నారు. ఆమెను ఈ కేసు ఇంకా వెంటాడుతూనే ఉంది. కాసేపటి క్రితం జైలుకు చేరుకున్న ఐటీ అధికారులు... ఆమెను విచారిస్తున్నారు. జయ నివాసం పోయస్ గార్డెన్ లో స్వాధీనం చేసుకున్న పత్రాలకు సంబంధించి ఆమెను ప్రశ్నిస్తూ, సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు, రేపు రెండు రోజులపాటు ఆమెను ఐటీ అధికారులు విచారించనున్నట్టు సమాచారం. 

More Telugu News