reliance: తిరుపతి వద్ద రిలయన్స్ సెజ్ కు రంగం సిద్ధం

  • 150 ఎకరాల విస్తీర్ణంలో రిలయన్స్ ఎలక్ట్రానిక్ సెజ్
  • వచ్చే నెలలో శంకుస్థాపన
  • రూ. 15 వేల కోట్ల పెట్టుబడులు పెడుతున్న రిలయన్స్

ఏపీలో రిలయన్స్ ఇండస్ట్రీస్ తన కార్యకలాపాలను ప్రారంభించబోతోంది. తిరుపతి సమీపంలో 150 ఎకరాల విస్తీర్ణంలో 'రిలయన్స్ ఎలక్ట్రానిక్ సెజ్'ను ఏర్పాటు చేయనుంది. వచ్చే నెల ఈ సెజ్ కు శంకుస్థాపన చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, మంత్రి లోకేష్ తదితరులు పాల్గొననున్నారు. ఈ సెజ్ లో రిలయన్స్ దాదాపు రూ. 15 వేల కోట్ల పెట్టుబడులు పెడుతోంది. జియో ఫోన్లు, సెట్ టాప్ బాక్స్ లతో పాటు రోజుకు దాదాపు 10 లక్షల వస్తువులను ఇక్కడ ఉత్పత్తి చేయబోతున్నారు. 

More Telugu News