team india: రెండో టెస్టుకు దూరమైన రోహిత్ శర్మ, అశ్విన్.. ఆంధ్ర కుర్రాడికి చోటు!

  • అనారోగ్య సమస్యలతో దూరమైన రోహిత్, అశ్విన్, పృథ్వి షా
  • జట్టులోకి ఉమేష్ యాదవ్, హనుమ విహారి, జడేజా
  • పెర్త్ లో శుక్రవారం ప్రారంభం కానున్న రెండో టెస్టు

భారత్, ఆస్ట్రేలియాల మధ్య పెర్త్ లో జరగనున్న రెండో టెస్ట్ శుక్రవారం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో 13 మందితో కూడిన తుది జట్టును బీసీసీఐ ప్రకటించింది. స్టార్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ, స్పిన్నర్ రవిచందర్ అశ్విన్ లను బీసీసీఐ పక్కన పెట్టింది. టీనేజ్ ఓపెనర్ పృథ్వి షా కాలి గాయం నుంచి కోలుకుంటున్నాడని... అతని పేరును రెండో టెస్టుకు పరిశీలించలేదని బీసీసీఐ తెలిపింది.

గాయపడ్డ రోహిత్ శర్మ ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాడని, అందుకే అతన్ని పక్కన పెట్టామని వెల్లడించింది. అశ్విన్ కడుపునొప్పితో బాధపడుతూ చికిత్స పొందుతున్నాడని, ఈ నేపథ్యంలో అతన్ని కూడా ఎంపిక చేయలేదని తెలిపింది. 13 మందితో కూడిన జట్టులోకి ఉమేష్ యాదవ్, ఆంధ్ర కుర్రాడు హనుమ విహారి, రవీంద్ర జడేజాలు వచ్చారు.

టీమిండియా జట్టు ఇదే:

విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానే (వైస్ కెప్టెన్), మురళీ విజయ్, కేఎల్ రాహుల్, చటేశ్వర్ పుజారా, హనుమ విహారి, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మ, మొహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, ఉమేష్ యాదవ్.  

More Telugu News