Rajarshi: కృషితో నాస్తి దుర్భిక్షమని లోకాన్ని శాసించు.. ఎన్టీఆర్ బయోపిక్ నుండి మరో సాంగ్!

  • రెండవ సాంగ్ గా 'రాజర్షి' విడుదల 
  • బాలకృష్ణ ప్రధాన పాత్రలో ఎన్టీఆర్ బయోపిక్
  • ఇప్పటికే విడుదలైన మొదటి పాటకి మంచి స్పందన

బాలకృష్ణ ప్రధాన పాత్రలో రూపొందుతోన్న ఎన్టీఆర్ బయోపిక్ నుండి ఇటీవల విడుదలైన మొదటి పాటకి మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి చిత్ర బృందం రెండవ సాంగ్ గా 'రాజర్షి'ని వదిలారు. 'తల్లి ఏదీ? తండ్రి ఏడీ? అడ్డుతగిలే బంధమేది?.. మమత లేవీ? మాయలేవీ? మనసు పొరల మసకలేవీ.. నీ ఇల్లు నీ వాళ్లు నీదంటు ఏ చింత సుంతైన లేని ఈ నేలపై నడయాడు.. ఋషివో.. కృషితో నాస్తి దుర్భిక్షమని లోకాన్ని శాసించు.. అంటూ ఈ పాట కొనసాగుతోంది.

ఈ పాట సాహిత్యాన్ని బట్టి చూస్తుంటే, ఇది 'మహానాయకుడు'లో ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానంలో చోటు చేసుకున్నదిగా తోస్తోంది. తెలుగు ప్రజలతో మమేకమవుతూ .. అహర్నిశలు వాళ్ల క్షేమం కోసం శ్రమించే మహాశక్తిగా ఆయన దూసుకుపోతుండటంపై ఈ పాట ప్లే అవుతుందని అనిపిస్తోంది. సంగీతం .. సాహిత్యం .. ఆలాపన అద్భుతంగా కుదిరి రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తోంది. 

More Telugu News