Telangana: తెలంగాణ భవన్ కు చేరుకున్న కేసీఆర్

  • కేసీఆర్ కు ఘన స్వాగతం పలికిన పార్టీ నేతలు
  • ఆయనకు అభినందనలు తెలిపిన నేతలు
  • తెలుగుతల్లి విగ్రహానికి అంజలి ఘటించిన కేసీఆర్

తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ లభించింది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈరోజు సాయంత్రం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. తెలంగాణ భవన్ కు చేరుకున్న ఆయనకు పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. కేసీఆర్ కు అభినందనలు తెలిపారు. కేసీఆర్ మెడలో పార్టీ కండువా వేసి ఆ పార్టీ సీనియర్ నేత కె.కేశవరావు స్వాగతం పలికారు. తెలుగుతల్లి విగ్రహానికి కేసీఆర్ పుష్పాంజలి ఘటించారు. 

More Telugu News