Telugudesam: టీడీపీకి ఆంధ్రా సెటిలర్లు దిమ్మ తిరిగే తీర్పు ఇచ్చారు.. బాబును వాళ్లు కూడా నమ్మట్లేదు: జీవీఎల్

  • ఏపీలో టీడీపీకి కౌంట్ డౌన్ మొదలైంది
  • కోతలకు ఓట్లు పడవు
  • అహంకారానికి మూల్యం చెల్లించక తప్పదు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ దూసుకుపోతుండగా, ప్రజాకూటమి వెనుకబడింది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పందించారు. చంద్రబాబును ఆంధ్రా సెటిలర్లు కూడా నమ్మడం లేదన్నది ఈ ఫలితాలతో రుజువైందని అన్నారు. ఏపీలో టీడీపీకి కౌంట్ డౌన్ మొదలైందని అభిప్రాయపడ్డారు. కోతలకు ఓట్లు పడవని, అడ్డగోలు అవినీతికి, అహంకారానికి మూల్యం చెల్లించక తప్పదని అన్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీకి ఆంధ్రా సెట్లెర్స్ దిమ్మ తిరిగే తీర్పు ఇచ్చారని జీవీఎల్ అన్నారు.

More Telugu News