Telangana: కేటీఆర్ అన్నా.. ఈ బుల్లెట్ దెబ్బ గుర్తుండిపోతుంది: ట్విట్టర్ లో మంచు మనోజ్ ప్రశంసలు!

  • ప్రభుత్వ ఏర్పాటు దిశగా టీఆర్ఎస్
  • 42 స్థానాల్లో ఇప్పటికే ఘనవిజయం
  • కేటీఆర్ కు మనోజ్ అభినందనలు

తెలంగాణ ఎన్నికల్లో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా అధికార టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తాజా పరిస్థితుల నేపథ్యంలో 46 సీట్లలో విజయం సాధించిన టీఆర్ఎస్.. మరో 42 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు, హీరో మంచు మనోజ్ తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు.

ఈ రోజు ఉదయం ట్విట్టర్ లో స్పందిస్తూ. ‘కేటీఆర్ అన్నా.. ఒక్క బుల్లెట్ తో అంతమందా? ఈ దెబ్బ గుర్తుండిపోతుంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించినందుకు అభినందనలు. గతంలో లాగే ఇకపై కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తారని ఆశిస్తున్నా’ అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు కేటీఆర్ తో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం, టీఆర్ఎస్ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్స్ ను ట్యాగ్ చేశారు.

More Telugu News