Andhra Pradesh: తెలంగాణలో ఓడిన అసలైన ప్రముఖులు వీరే!.. వెటకారంగా స్పందించిన విజయసాయిరెడ్డి!

  • చంద్రబాబు, బాలయ్య ఓడారని వ్యాఖ్య
  • జాబితాలో ఇద్దరు మీడియా అధిపతులు
  • కాంగ్రెస్ పార్టీ టీడీపీ తోకపట్టుకుందని ఎద్దేవా

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి, వర్దన్నపేట, కంటోన్మెంట్ సహా పలు స్థానాల్లో ఘనవిజయం సాధించింది. ఈ నేపథ్యంలో వైసీపీ నేత విజయసాయిరెడ్డి ప్రజాకూటమి నేతలపై విమర్శల దాడిని పెంచారు. తెలంగాణ ఎన్నికల్లో ఓడిపోయిన వారు వీరేనంటూ ఓ జాబితాను ప్రకటించారు. విజయసాయిరెడ్డి ఈ రోజు ట్విట్టర్ లో స్పందిస్తూ..

‘తెలంగాణ ఎన్నికల్లో ఓడిన ప్రముఖుల జాబితా ఇదే,
1) చంద్రబాబు నాయుడు
2) బాలకృష్ణ
3) లగడపాటి రాజగోపాల్
4) ఏబీఎన్-ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ
5) ఈనాడు-ఈటీవి రామోజీ
6) మునుగుతున్న చంద్రబాబు తోకపట్టుకుని ఈదటానికి ప్రయత్నించిన కాంగ్రెస్’ ... అంటూ వ్యంగ్యంగా స్పందించారు.

More Telugu News