TRS: 'జయం జయం...' ప్రత్యేక పాటను విడుదల చేసిన టీఆర్ఎస్

  • పాలనకు, దక్షతకు పెద్దపీట
  • భద్రతకు, భరోసాకు ప్రజల మద్దతు
  • టీఆర్ఎస్ మాత్రమే మేలు చేస్తుందన్న పాట

తెలంగాణ ఎన్నికల్లో ఘన విజయం ఖాయమైన నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రత్యేక గీతాన్ని విడుదల చేసింది. "జయం జయం..." అంటూ ఈ పాట సాగుతుండగా, పాలనకు, నాయకులకు, దక్షతకు, సుస్థిరతకు ప్రజలు పెద్దపీట వేశారని, పథకాలకు, అభివృద్ధికి, భద్రతకు, భరోసాకు ప్రజలు మద్దతు పలికారన్నట్టుగా సాగుతుంది. సబ్బండ వర్గాలకు, సకల జనుల ఆకాంక్షలకు టీఆర్ఎస్ మాత్రమే మేలుకలిగిస్తుందన్న అర్థం వచ్చేలా సాగే ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలంగాణ సంస్కృతిని, ప్రజల జీవనశైలిని ప్రతిబింబించేలా ఈ పాటలోని దృశ్యాలను చిత్రీకరించారు.

More Telugu News