Telangana: శేరిలింగంపల్లిలో భవ్య ఆనంద ప్రసాద్ కు షాక్.. 9,000 ఓట్ల లీడ్ లో టీఆర్ఎస్!

  • మహాకూటమి తరఫున ఆనంద ప్రసాద్ పోటీ
  • దూసుకుపోతున్న టీఆర్ఎస్ అభ్యర్థి గాంధీ
  • టీడీపీకి గట్టి పట్టున్న ప్రాంతంలో భిన్నమైన తీర్పు

తెలంగాణలోని శేరిలింగంపల్లిలో మహాకూటమి అభ్యర్థి, టీడీపీ నేత, భవ్య సిమెంట్స్ అధినేత వెనిగళ్ల ఆనందప్రసాద్ కు ఎదురుగాలి విస్తోంది. ఇప్పటివరకూ వెల్లడయిన ఫలితాల మేరకు టీఆర్ఎస్ అభ్యర్థి అరికెపూడి గాంధీ టీడీపీ అభ్యర్థి ప్రసాద్ పై 9,510 ఓట్ల ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. టీడీపీకి గట్టిపట్టు ఉందని భావిస్తున్న శేరిలింగంపల్లిలో ఓటర్లు విభిన్నమైన తీర్పును ఇచ్చారు.

More Telugu News