Congress: రాజస్థాన్‌లో కాంగ్రెస్ హవా.. సచిన్ పైలట్ ఇంటి వద్ద కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు

  • కాంగ్రెస్ 75 స్థానాల్లో ఆధిక్యం
  • 65 స్థానాల్లో బీజేపీ
  • సచిన్ పైలట్ ఇంటి బయట కాంగ్రెస్ కార్యకర్తల హంగామా

రాజస్థాన్‌లో కాంగ్రెస్ అప్పుడే సంబరాలు మొదలుపెట్టేసింది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం.. కాంగ్రెస్ 75 సీట్లలో ఆధిక్యంలో ఉండగా, బీజేపీ 65 సీట్లలో ఆధిక్యంలో ఉంది. రాజస్థాన్‌లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని మొదటి నుంచి చెబుతున్న కాంగ్రెస్ శ్రేణులు గెలుపుపై ధీమా ఉన్నారు. ఇప్పుడు ట్రెండ్స్ కూడా ఆ పార్టీకి అనుకూలంగా ఉండడంతో  కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున సీఎం అభ్యర్థి సచిన్ పైలట్ ఇంటి వద్దకు చేరుకుని సంబరాలు చేసుకుంటున్నారు.

More Telugu News