Telangana: డీకే అరుణ, జానారెడ్డి, పొన్నాల వెనుకంజ... రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి లీడ్!

  • రేవంత్ రెడ్డి ముందంజ
  • కోమటిరెడ్డి రాజగోపాల్, సబితా ఇంద్రారెడ్డి కూడా
  • ఇబ్రహీంపట్నంలో మల్ రెడ్డికి లీడ్

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలైన పలువురు కౌంటింగ్ తొలి ట్రెండ్స్ ను బట్టి వెనుకంజలో ఉండగా, మరికొందరు లీడ్ లోకి వెళ్లిపోయారు. డీకే అరుణ, జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య తదితరులు వెనుకబడిపోయినట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో కొడంగల్ నుంచి పోటీపడిన రేవంత్ రెడ్డి, మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. ఇబ్రహీంపట్నంలో మహాకూటమి మద్దతుతో పోటీపడిన మల్ రెడ్డి రంగారెడ్డి ముందంజలో ఉన్నారు.

More Telugu News