Congress: తెలంగాణలో తొలి ట్రెండ్స్ ఇవే!

  • పోస్టల్ బ్యాలెట్‌లో టీఆర్ఎస్ ఆధిక్యం
  • మధ్యప్రదేశ్, రాజస్థాన్‌, చత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్ ఆధిక్యం
  • వెల్లడవుతున్న ట్రెండ్స్

తెలంగాణలో ఎన్నికల ఫలితాల ట్రెండ్స్ మొదలయ్యాయి. తొలి ట్రెండ్స్‌లోనే పోటీ బయటపడింది. కాంగ్రెస్-టీఆర్ఎస్ మధ్య హోరాహోరీ తప్పదని తేలిపోయింది. ఇప్పటి వరకు వెల్లడైన పోస్టల్ బ్యాలెట్లలో కారు, హస్తం ఒక్కో స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. మరోవైపు, దేశవ్యాప్తంగానూ కాంగ్రెస్ జోరు కొనసాగే అవకాశం ఉన్నట్టు ట్రెండ్స్ ద్వారా తెలుస్తోంది.

రాజస్థాన్‌లో కాంగ్రెస్ 5, చత్తీస్‌గఢ్‌లో 9 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. విజయంపై బీజేపీ ఆశలు పెట్టుకున్న మధ్యప్రదేశ్‌లోనూ కాంగ్రెస్ ఐదు స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, బీజేపీ 3 స్థానాలలో ఆధిక్యంలో ఉంది. ఇక, తెలంగాణలోని మక్తల్‌లో మొత్తం 1228 పోస్టల్ ఓట్లు ఉండగా టీఆర్ఎస్ 117 ఓట్ల ఆధిక్యంలో ఉంది. సిరిసిల్లలోనూ పోస్టల్ బ్యాలెట్లలో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది.

More Telugu News