Telangana: మిగతా నాలుగు రాష్ట్రాల తొలి ట్రెండ్స్... అన్నింటా కాంగ్రెస్!

  • మొదలైన ఓట్ల లెక్కింపు
  • రాజస్థాన్ లో బీజేపీ 2, కాంగ్రెస్ 5 చోట్ల ఆధిక్యం
  • మధ్యప్రదేశ్ లో బీజేపీ 1, కాంగ్రెస్ 2

ఇండియాలోని ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరళి ప్రారంభమైంది. మిజోరంలో 40 అసెంబ్లీ స్థానాలుండగా, 3 అసెంబ్లీ నియోజకవర్గాల ట్రెండ్స్ విడుదలయ్యాయి. బీజేపీకి 1, కాంగ్రెస్ 2 చోట్ల ఆధిక్యంలో ఉంది. ఇక చత్తీస్ గఢ్ లో 90 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా, 5 చోట్ల ట్రెండ్స్ వెలువడ్డాయి. బీజేపీ 2, కాంగ్రెస్ 3 చోట్ల ఆధిక్యంలో ఉంది. రాజస్థాన్ లో 200 అసెంబ్లీ స్థానాలుండగా, ఏడింట వెలువడిన ట్రెండ్స్ మేరకు బీజేపీ 2, కాంగ్రెస్ 5 చోట్ల ఆధిక్యంలో ఉంది. మధ్యప్రదేశ్ లో మూడింట ట్రెండ్స్ వెలువడగా ఒకచోట బీజేపీ, రెండు చోట్ల కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నాయి.

More Telugu News