prajakutami: ప్రజాకూటమి నేతలకు అపాయింట్ మెంట్ ఇచ్చిన గవర్నర్

  • నాలుగు పార్టీలను ఒక జట్టుగా గుర్తించాలని కోరనున్న ప్రజాకూటమి నేతలు
  • మధ్యాహ్నం 3.15 గంటలకు అపాయింట్ మెంట్ ఖరారు
  • రేపు వెల్లడి కానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెల్లడి కానున్నాయి. ఈ ఫలితాలు ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠను రేపుతున్నాయి. మరోవైపు, ప్రజాకూటమిగా పోటీ చేసిన నాలుగు పార్టీలను ఒక జట్టుగా గుర్తించాలని కూటమి నేతలు కోరుతున్నారు. ఈ మేరకు ఈ విషయాన్ని గవర్నర్ నరసింహన్ కు విన్నవించేందుకు ఆయన అపాయింట్ మెంట్ ను కోరారు. ఈ నేపథ్యంలో, కూటమి నేతలకు మధ్యాహ్నం 3.15 గంటలకు గవర్నర్ అపాయింట్ మెంట్ ఇచ్చారు. గవర్నర్ తో భేటీ సందర్భంగా, కాంగ్రెస్ నేతలపై జరిగిన భౌతిక దాడులు, ఓట్ల గల్లంతుపై కూడా నేతలు ఫిర్యాదు చేయనున్నారు.  

More Telugu News