balakrishna: ఎన్టీఆర్ బయోపిక్ నుంచి సెకండ్ సింగిల్ వచ్చేస్తోంది

  • ఇటీవలే వచ్చిన ఫస్టు సింగిల్ 
  • ఈ రోజు సాయంత్రం సెకండ్ సింగిల్ 
  • సంగీత దర్శకుడిగా కీరవాణి  

క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ రూపొందుతోంది. మొదటిభాగమైన 'కథానాయకుడు' షూటింగు పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. రెండవ భాగమైన 'మహానాయకుడు' షూటింగ్ చకచకా జరిగిపోతోంది. ఈ సినిమా నుంచి వరుసగా వదులుతోన్న పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక ఇటీవల వదిలిన ఫస్టు సింగిల్ కి కూడా అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది.

ఈ నేపథ్యంలో ఈ బయోపిక్ నుంచి రెండవ సింగిల్ ను వదలడానికి టీమ్ రెడీ అవుతోంది. ఈ రోజు సాయంత్రం 4 గంటల 21 నిమిషాలకి 'రాజర్షి .. ' అంటూ సాగే సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని స్పెషల్ పోస్టర్ ద్వారా ప్రకటించారు. ఎన్టీఆర్ గా బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ లోగోలో ఒకటైన 'నాగలి' బొమ్మను గోడపై గీస్తున్నట్టుగా ఈ పోస్టర్ పై కనిపిస్తున్నారు. కీరవాణి స్వరపరిచిన ఈ పాట ఏ స్థాయిలో దూసుకెళుతుందో చూడాలి మరి.  

More Telugu News