Shruti Hassan: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • నిర్మాతగా మారిన శ్రుతి హాసన్ 
  • 16న 'కథానాయకుడు' ట్రైలర్ 
  • 'పింక్' రీమేక్ లో విద్యాబాలన్ 

*  'కాటమరాయుడు' చిత్రం తర్వాత తెలుగు సినిమా ఏదీ చేయని కథానాయిక శ్రుతిహాసన్ గత కొన్నాళ్లుగా నటనకు దూరంగానే వుంది. ఈ నేపథ్యంలో ఈ చిన్నది తాజాగా నిర్మాతగా మారింది. 'మస్కిటో ఫిలాసఫీ' పేరిట ఓ చిత్రాన్ని నిర్మించింది. దీనికి జయప్రకాశ్ రాధాకృష్ణన్ దర్శకత్వం వహించాడు. మంచి కథలు వస్తే ముందు ముందు కూడా సినిమాలు నిర్మిస్తానని శ్రుతి చెప్పింది.
*  బాలకృష్ణ ప్రధాన పాత్రధారిగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఎన్టీఆర్ బయోపిక్ మొదటి భాగం 'కథానాయకుడు' జనవరి 9న విడుదలకు రెడీ అవుతోంది. ఈ క్రమంలో ఈ నెల 16న ఈ చిత్రం ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
*  రెండేళ్ల క్రితం హిందీలో వచ్చిన 'పింక్' చిత్రాన్ని తమిళంలో అజిత్ హీరోగా రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో కథానాయికగా బాలీవుడ్ భామ విద్యాబాలన్ ను ఎంచుకున్నట్టు సమాచారం. దీనిని తెలుగులోకి కూడా అనువదిస్తారు.

More Telugu News