Adi narayana Reddy: కడప జిల్లాలో మంత్రిని అడ్డుకున్న వైసీపీ నేత.. ఉద్రిక్తత

  • వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు
  • మంత్రిని అడ్డుకున్న సుధీర్ రెడ్డి
  • భారీగా మోహరించిన పోలీసులు

కడప జిల్లాలోని ఎర్రగుంట మండలం సిరాజుపల్లెలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసీపీకి పట్టున్న ఆ గ్రామం నుంచి టీడీపీలోకి చేరేందుకు కొందరు గ్రామస్తులు సిద్ధమైన నేపథ్యంలో వైసీపీ ఆందోళన చేసింది. దీంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. సిరాజుపల్లి వైసీపీకి బాగా పట్టున్న గ్రామం.

ఈ గ్రామం నుంచి కొందరు వైసీపీ కార్యకర్తలు మంత్రి ఆదినారాయణ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఆదినారాయణరెడ్డిని అడ్డుకునేందుకు వైసీపీ నేత సుధీర్ రెడ్డి యత్నించారు. దీంతో ఆ గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు భారీగా గ్రామంలో మోహరించారు.

More Telugu News