TRS: టీఆర్ఎస్ లేదా ప్రజా కూటమి.. అధికారంలోకి ఎవరొచ్చినా ఒరిగేదేమీలేదు: సీపీఎం రాఘవులు

  • తెలంగాణకు కేసీఆర్ చేసిందేమీలేదు
  • ఈ ఎన్నికల్లో బీఎల్ ఎఫ్ గట్టిపోటీ ఇచ్చింది
  • ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ‘జనసేన’తో కలిసి పోటీ చేస్తాం

నాలుగున్నరేళ్లుగా తెలంగాణకు కేసీఆర్ చేసిందేమీలేదని సీపీఎం నేత రాఘవులు విమర్శించారు. ప్రజా కూటమి, టీఆర్ఎస్.. ఎవరు అధికారంలోకొచ్చినా ప్రజలకు ఒరిగేదేమీ లేదని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఎన్నికల్లో బీఎల్ ఎఫ్ గట్టిపోటీ ఇచ్చిందని అన్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీతో కలిసి పోటీ చేస్తామని, బీజేపీని ఓడించేందుకు లౌకికశక్తులతో కలుస్తామని స్పష్టం చేశారు.

More Telugu News