china rajappa: తెలంగాణలో ప్రజాకూటమి విజయం సాధించడం ఖాయం: ఏపీ మంత్రి చినరాజప్ప

  • ఓటింగ్ శాతం పెరుగుదల కూటమి విజయానికి సంకేతం
  • ఈ నెల 10న చంద్రబాబు ఢిల్లీ వెళుతున్నారు
  • కూటమి విధివిధానాలను నిర్ణయిస్తారు

తెలంగాణలో ప్రజాకూటమి విజయం సాధించడం ఖాయమని ఏపీ డిప్యూటీ సీఎం చినరాజప్ప అభిప్రాయపడ్డారు. ఓటింగ్ శాతం పెరుగుదల ప్రజాకూటమి విజయానికి సంకేతమని, తెలంగాణ అభివృద్ధికి చంద్రబాబు చేసిన కృషి కూటమి విజయానికి తోడ్పడుతుందని అన్నారు. ఈ నెల 10న చంద్రబాబునాయుడు ఢిల్లీ వెళుతున్నారని, కూటమి విధివిధానాలను నిర్ణయించడం జరుగుతుందని చెప్పారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్ పై ఆయన విమర్శలు చేశారు.

నిన్న శ్రీకాకుళంలో జగన్ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. అవినీతి రహిత సమాజాన్ని స్థాపిస్తానంటున్న జగనే కుంభకోణాల కేసుల్లో ఇరుక్కుపోయి ఉన్నారని విమర్శించారు. తనపై అవినీతి కేసులున్న జగన్ ఈ వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదమని, ఒక అవినీతిపరుడు నీతులు చెప్పడం సబబు కాదని, రాష్ట్రాభివృద్ధిని జగన్ అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. 

More Telugu News