Andhra Pradesh: కృష్ణా జిల్లాలో స్వైన్ ఫ్లూ కలకలం.. భయంతో వణికిపోతున్న గ్రామస్తులు!

  • స్వైన్ ఫ్లూతో ఇద్దరు చింతకోళ్ల వాసుల మృతి
  • భయంతో ఇళ్లనుంచి బయటకురాని గ్రామస్తులు
  • అడ్రస్ లేకుండా పోయిన అధికారులు

ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో స్వైన్ ఫ్లూ కలకలం చెలరేగింది. ఇక్కడి కోడూరు మండలం చింతకోళ్ల గ్రామంలో ఇద్దరు వ్యక్తులు స్వైన్ ఫ్లూ వ్యాధికి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో చింతకోళ్లతో పాటు కోడూరు అంతటా స్వైన్ ఫ్లూ వ్యాపించిందని పుకార్లు చెలరేగాయి. దీంతో పలు ప్రైవేటు పాఠశాలలు అనధికారికంగా సెలవులను ప్రకటించాయి. మరోవైపు చింతకోళ్ల గ్రామంలో ప్రజలు బయటకు రావడానికే భయపడుతున్నారు. కాగా, ఈ సందర్భంగా ప్రజలకు స్వైన్ ఫ్లూపై అవగాహన కల్పించాల్సిన అధికారులు ఇప్పటివరకూ ఈ ప్రాంతానికి రాలేదు.

More Telugu News