Mukhesh Ambani: ఈశా అంబానీ పెళ్లికి వచ్చే అతిథులకు 'ఫొటోల' ఆంక్షలు!

  • 12న జరగనున్న వివాహం
  • సెల్‌ఫోన్లు నిషేధం
  • ఫొటోలను షేర్ చేయకూడదు

ముకేష్ అంబానీ ముద్దుల తనయ ఈశా వివాహం ఆనంద్ పిరమాల్‌తో ఈ నెల 12న జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వివాహ వేడుకలు ప్రారంభమయ్యాయి. దీనికి ఉదయ్‌పూర్‌లోని ఒబెరాయ్ ఉదయ్ విలాస్ వేదికగా మారింది. నేడు మెహందీ, రేపు సంగీత్ వేడుక జరగనున్నాయి. అయితే ఈ వివాహానికి వచ్చే అతిథులకు ఆంక్షలు విధించారు.

 పెళ్లికి వచ్చే అతిథులెవరూ ఫోన్లు తీసుకెళ్లడానికి వీల్లేదు. అంతేకాదు.. వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడం నిషేధం. ఈ మేరకు ముకేష్ దంపతులు అతిథులను సహకరించాలని కోరారు. వివాహ వేడుక పూర్తయిన రోజే స్వయంగా అంబానీ కుటుంబ సభ్యులు ఫొటోలను, వీడియోలను షేర్ చేస్తామని వెల్లడించారు.

More Telugu News